జర్నలిస్టులకు బువ్వకుండ...

 జర్నలిస్టులకు బువ్వకుండ...


నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్15( తెలంగాణ మేఘటైమ్స్): నిజామాబాద్ ప్రెస్  క్లబ్ లో  జర్నలిస్టుల కోసం కెసిఆర్ బువ్వ కుండ  పథకాన్ని తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన మూడు సంవత్సరాలుగా జిల్లా ఆసుపత్రి మరియు బోధన్ ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.

 అదేవిధంగా జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షల కొరకై ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల నుండి నగరానికి వస్తున్న జర్నలిస్టులు   బిజీగా ఉంటూ మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు  వారికోసం తాజాగా జర్నలిస్టులకు బువ్వ కుండ పథకాన్ని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు తమకు అండగా ఉండడంతో పాటు ఆకలి తీర్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవిత కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ ప్రతినిధులు యూనియన్ల నాయకులు  జర్నలిస్టులు పాల్గొన్నారు.












Comments

Popular posts from this blog

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకుల అరెస్ట్...